Skip to main content

Covid-19: 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా?

ZyCov-D vaccine

కోవిడ్‌–19 మహమ్మారి నియంత్రణకు గాను 12 నుంచి 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ కోటి డోసుల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చినట్లు అధికార వర్గాలు నవంబర్‌ 7న తెలిపాయి. ఈ టీకాకు 2021, ఆగస్టు 20న డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్‌ ఒక్కో డోస్‌కు పన్నులు మినహాయించి రూ.358 ఖర్చవుతుంది.

ఏ.వై. 4.2 వైరస్‌ అనేది ఏ వ్యాధికి చెందినది?

కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ ఏ.వై.4.2 వ్యాప్తిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్‌) స్పష్టం చేసింది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఏవై.4.2 వేరియంట్‌కు సంబంధించిన కేసులు 0.1 శాతం మాత్రమేనని తెలిపింది. ప్రస్తుతానికి దేశంలో డెల్టా వేరియంట్‌ (బి.1.617.2 మరియు ఏవై.ఎక్స్‌) మాత్రమే ఆందోళనకర స్థాయిలో ఉందని పేర్కొంది.
 

చ‌ద‌వండి: పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : 12 నుంచి 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా?
ఎప్పుడు : నవంబర్‌ 7
ఎవరు     : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ 
ఎందుకు : కోవిడ్‌–19 మహమ్మారి నియంత్రణకు గాను...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 08 Nov 2021 06:11PM

Photo Stories