Skip to main content

Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లో తొలి విదేశీ పెట్టుబడి

First foreign investment in Jammu and Kashmir

జమ్మూకాశ్మీర్‌కు తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) వచ్చింది. దుబాయికి చెందిన ఎమార్‌ గ్రూపు రూ.500 కోట్లతో షాపింగ్‌ మాల్, మల్టీపర్పస్‌ టవర్‌ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, జమ్మూకాశ్మీరును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎఫ్‌డీఐ ఇదే కావడం విశేషం. బుర్జ్‌ ఖలీఫా, దుబాయ్‌ మాల్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణాలు చేసిన ఎమార్‌ గ్రూపు కశ్మీరు లోయలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2023 05:21PM

Photo Stories