Skip to main content

Digital Personal Data Protection Bill: వినియోగదారుల డిజిటల్‌ డేటాని దుర్వినియోగం చేసేవారిపై కేంద్రం కొరడా..

పౌరుల డిజిటల్‌ హక్కులు, వ్యక్తిగత సమాచార భద్రతకు ఉద్దేశించిన డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటక్షన్‌ బిల్లును గురువారం లోక్‌సభలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌  ప్రవేశపెట్టారు.
Digital-Personal-Data-Protection-Bill
Digital Personal Data Protection Bill

ఇది సాధారణ బిల్లేనని స్పష్టం చేశారు. గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉంచిన ముసాయిదా బిల్లుపై వచ్చిన సలహాలు సూచనలతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వినియోగదారుల డిజిటల్‌ డేటాని దుర్వినియోగం చేసేవారిపై కేంద్రం కొరడా ఝళిపించింది. అలాంటి సంస్థలపై రూ.50 నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించనుంది. అంతేకాకుండా ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా డేటా ప్రొటక్షన్‌ బోర్డుని ఏర్పాటు చేయనున్నట్టుగా బిల్లులో పేర్కొంది.]

☛☛ Data Protection Bill: డేటా పరిరక్షణ బిల్లుకి కేంద్రం ఆమోదం

Published date : 04 Aug 2023 07:02PM

Photo Stories