Skip to main content

Russia-Ukraine War: ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై నిషేధం విధించిన దేశం?

Twitter, Facebook

తమ దేశం ఉక్రెయిన్‌పై దాడికి దిగిందని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ పలు మీడియా సంస్థలపై మార్చి 5న రష్యా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే బీబీసీ, వాయిస్‌ ఆఫ్‌ అమెరికా, డూషెవెల్లి, మెడుజా సంస్థలను నిషేధించిన రష్యా, తాజాగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ను కూడా నిలిపివేసింది. రష్యాపై తప్పుడు వార్తలు ప్రసారం చేసే సంస్థలపై క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు వీలు కల్పించేలా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. మీడియాపై నియంత్రణకు ఉద్దేశించిన బిల్లును రష్యా చట్టసభలు వెనువెంటనే ఆమోదించగా, అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకం చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్‌ యుద్ధంపై తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తే ఇకపై 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.

తప్పుకుంటున్న సంస్థలు
మీడియాపై నియంత్రణ పెరగడంతో పలు విదేశీ మీడియా సంస్థలు రష్యాలో కార్యకలాపాలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నాయి. రష్యాల ప్రసారాలు తాత్కాలికంగా నిలిపివేస్తామని సీఎన్‌ఎన్, బ్లూమ్‌బర్గ్‌ లాంటి సంస్థలు ప్రకటించాయి.

2022 Financial Year: చైనా రక్షణ బడ్జెట్‌ను ఎంత శాతం పెంచారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై నిషేధం విధించిన దేశం?
ఎప్పుడు : మార్చి 5
ఎవరు    : రష్యా
ఎక్కడ    : రష్యా వ్యాప్తంగా...
ఎందుకు : రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగిందని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Mar 2022 01:53PM

Photo Stories