సియోల్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. దక్షిణకొరియా, అమెరికాలు చేపట్టిన భారీ వైమానిక విన్యాసాలపై గుర్రుగా ఉన్న ఉత్తరకొరియా రెచ్చిపోయింది.
North Korean missile tests
నవంబర్ 2న ఒక్క రోజే 23 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఒక క్షిపణి ఉభయ కొరియాల సరిహద్దులకు సమీపంలోకి దూసుకెళ్లింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా రెడ్ అలెర్ట్ ప్రకటించి, ముందు జాగ్రత్తగా పౌరులను భూగర్భ షెల్టర్లలోకి తరలించింది. పలు క్షిపణులను సరిహద్దులకు సమీపంలోకి ప్రయోగించి దీటుగా స్పందించింది.