Skip to main content

FM Nirmala Sitharaman: జీ20 ఆర్థికమంత్రుల సమావేశం నేతృత్వం వహిస్తోన్న దేశం?

Nirmala SItharaman

ఇండోనేషియా నేతృత్వంలో ఫిబ్రవరి 17, 18 తేదీలలో జరుగుతున్న జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల మొదటి వర్చువల్‌ ప్యానల్‌ సమావేశాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 17న భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ ఆర్థిక రికవరీకి వీలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీ తగిన సమాన స్థాయిలో వేగంగా జరగాలని ఆమె పిలుపునిచ్చారు. జీ20 జాయింట్‌ ఫైనాన్స్, హెల్త్‌ టాస్క్‌ ఫోర్స్‌ కార్యాచరణ ఈ దిశలో పురోగమించలని అన్నారు. ద్రవ్యోల్బణం, సరఫరాల సమస్యలు, కొత్త వేరియెంట్ల భయాలు వంటి అంశాలుసహా అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌కు సంబంధించి ఆర్థికమంత్రి పలు అంశాలను సమావేశంలో ప్రస్తావించారు.

జీ–20 సభ్యదేశాలు..
జీ–20(గ్రూప్‌ ఆఫ్‌ 20) అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ఇందులో 19 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు సభ్యత్వం ఉంది. సభ్యదేశాలు ఇవే..

  1. అర్జెంటీనా
  2. ఆస్ట్రేలియా
  3. బ్రెజిల్‌
  4. కెనడా
  5. చైనా
  6. ఫ్రాన్స్‌
  7. జర్మనీ
  8. భారత్‌
  9. ఇండోనేషియా
  10. ఇటలీ
  11. జపాన్‌
  12. మెక్సికో
  13. రష్యా
  14. సౌదీ అరేబియా
  15. దక్షిణ కొరియా
  16. దక్షిణాఫ్రికా
  17. టర్కీ
  18. యునెటైడ్‌ కింగ్‌డమ్‌
  19. యునెటైడ్‌ స్టేట్స్‌
  20. యూరోపియన్‌ యూనియన్‌

చ‌ద‌వండి: ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు థీమ్‌ ఏమిటీ?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Feb 2022 03:10PM

Photo Stories