Skip to main content

Stefan Hartung: భారత్‌లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ?

BOSCH

ఆటోమోటివ్‌ రంగంలో అత్యాధునిక టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో  భారత్‌లో రానున్న ఐదేళ్లలో రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంతర్జాతీయ తయారీ కంపెనీ రాబర్ట్ బాష్ జీఎంబీహెచ్(బాష్‌) చైర్మన్‌ డాక్టర్‌ స్టెఫాన్‌ హటుంగ్‌ తెలిపారు.  డిజిటల్‌ మొబిలిటీ రంగంలో పెట్టే రూ.వెయ్యికోట్లకు ఇది అదనమని ఆయన అన్నారు.  భారత్‌లో బాష్‌ సంస్థ ఏర్పాటై వందేళ్లు అయిన సందర్భంగా ఫిబ్రవరి 3న ఏర్పాటైన వర్చువల్‌ విలేకరుల సమావేశాన్ని ఉద్ధేశించి హటుంగ్‌ ఈ మేరకు మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్ల కార్ల సర్వీసింగ్‌ కోసం బాష్‌ మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని 2025 నాటికల్లా కనీసం వెయ్యి కొత్త సర్వీస్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయని ఆయన చెప్పారు. 1886, నవంబర్ 15న రాబర్ట్‌ బాష్‌ స్థాపించిన బాష్ కంపెనీ.. ప్రధాన కార్యాలయం జర్మనీలోని గెర్లింగన్ పట్టణంలో ఉంది. 1922లో కోల్‌కతా నగరం నుంచి భారత్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.

టాప్స్‌ కోర్‌ గ్రూప్‌లో చోటు దక్కించుకున్న టెన్నిస్‌ క్రీడాకారిణి?

టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌) కోర్‌ గ్రూప్‌లో సీనియర్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పేరును కూడా చేర్చారు. ఈ సీజన్‌ తర్వాత రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించిన సానియా... ఒలింపిక్స్‌ సన్నాహక అథ్లెట్లలో లేకున్నా కూడా 2022 ఏడాది ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఆమెకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో రోహన్న బోపన్న, రామ్‌కుమార్‌ రామనాథన్, అంకితా రైనాలకు కూడా చోటు దక్కింది.

రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది?

రంజీ ట్రోఫీ-2022 నిర్వహణకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఈ మేరకు జనవరి 3న షెడ్యూల్‌ను విడుదల చేసింది. ట్రోఫీలో భాగంగా 38 టీమ్‌లు పాల్గొంటుండగా, మొత్తం 57 మ్యాచ్‌లు జరుగుతాయి.  ఫిబ్రవరి 10నుంచి మార్చి 15 వరకు లీగ్‌ దశ పోటీలు జరుగుతాయి. అనంతరం ఐపీఎల్‌ ముగిసిన తర్వాత మే 30నుంచి జూన్‌ 26 మధ్య 7 నాకౌట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మొత్తం 62 రోజుల వ్యవధిలో 64 రంజీ మ్యాచ్‌లు జరిపేందుకు బోర్డు సన్నద్ధమైంది. రాజ్‌కోట్, కటక్, చెన్నై, అహ్మదాబాద్, త్రివేండ్రం, ఢిల్లీ, హరియాణా, గువహటి, కోల్‌కతాలను టోర్నీ వేదికలుగా ఖరారు చేశారు. కరోనా వ్యాప్తితో వరుసగా గత రెండేళ్లుగా టోర్నీ జరగలేదు.

చ‌ద‌వండి: ఐఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రానున్న ఐదేళ్లలో రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు    : అంతర్జాతీయ తయారీ కంపెనీ రాబర్ట్ బాష్ జీఎంబీహెచ్(బాష్‌)
ఎక్కడ    : భారత్
ఎందుకు : ఆటోమోటివ్‌ రంగంలో అత్యాధునిక టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Feb 2022 06:09PM

Photo Stories