Skip to main content

Nirmala Sitharaman: ఏఐఐబీ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?

Nirmala

ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) గవర్నర్ల బోర్డ్‌ ఆరవ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి అక్టోబర్‌ 26న భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వర్చువల్‌ విధానం ద్వారా ప్రసంగించారు. సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల అవకాశాలను ఏఐఐబీ అన్వేషించాలని ఆమె సూచించారు. భారత్‌లో ఏఐఐబీ రెసిడెంట్‌ బోర్డ్, రీజినల్‌ ఆఫీస్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చైనా రాజధాని నగరం బీజింగ్‌లో ఏఐఐబీ ప్రధాన కార్యాలయం ఉంది.

క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం అంటే?

భారత్‌ బ్యాంకింగ్‌ ‘క్రెడిట్‌ అవుట్‌రీచ్‌’ కార్యక్రమం కింద దాదాపు 2 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.11,168 కోట్ల రుణాలను అందజేసిందని మంత్రి నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. బ్యాంకులు–నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఫిన్‌టెక్‌ సెక్టార్‌ల మధ్య సహ–రుణ  ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో కూడా ఇలాంటి అవుట్‌రీచ్‌ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి.
 

చ‌ద‌వండి: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో జట్టు కట్టిన బ్యాంక్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) గవర్నర్ల బోర్డ్‌ సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్‌ విధానం ద్వారా ప్రసంగం
ఎప్పుడు : అక్టోబర్‌ 26
ఎవరు    : భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
ఎందుకు : ఏఐఐబీ గవర్నర్ల బోర్డ్‌ ఆరవ వార్షిక సమావేశం సందర్భంగా...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

 

Published date : 27 Oct 2021 06:27PM

Photo Stories