Skip to main content

Merger of subsidiaries: అనుబంధ సంస్థల విలీనం పూర్తి: NTPC

 పూర్తి అనుబంధ సంస్థలు నంబినగర్‌ పవర్‌ జనరేటింగ్‌ కంపెనీ, కాంటి బిజిలీ ఉత్పాదన్‌ నిగమ్‌ లిమిటెడ్‌లను విలీనం చేసుకున్నట్లు ప్రభుత్వ రంగ విద్యుత్‌ దిగ్గజం ఎన్‌టీపీసీ తాజాగా పేర్కొంది.
Nabinagar, Kanti power projects merge with NTPC
Nabinagar, Kanti power projects merge with NTPC

2018లో ఈ రెండు కంపెనీలూ సొంత అనుబంధ సంస్థలుగా మారినట్లు తెలియజేసింది. ఈ రెండు సంస్థలలోనూ బీహార్‌ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కంపెనీకిగల ఈక్విటీ వాటాలను ఎన్‌టీపీసీ చేజిక్కించుకుంది. కాగా.. రెండు సంస్థల విలీనం పూర్తయినట్లు ఎన్‌టీపీసీ తాజాగా వెల్లడించింది. భాగస్వామ్య సంస్థ నంబినగర్‌ పవర్‌లో 50 శాతం వాటా కలిగిన ఎన్‌టీపీసీ మరో 50 శాతం వాటాను దక్కించుకుంది. ఇదే విధంగా కాంటి బిజిలీ ఉత్పాదన్‌లోనూ 27.36 శాతం వాటాను కొనుగోలు చేసింది. బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో నంబినగర్‌ పవర్‌ 1,980 మెగావాట్ల బొగ్గు ఆధారిత సూపర్‌ విద్యుదుత్పత్తి ప్లాంటును నిర్వహిస్తోంది. కాంటి బిజిలీ ఉత్పాదన్‌ సైతం ముజఫర్‌పూర్‌(బీహార్‌)లో బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంటును కలిగి ఉంది. 

Also read: RBI Statistics : పటిష్ట బాటన భారత్‌ ఎకానమీ..!

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 27 Aug 2022 06:01PM

Photo Stories