Skip to main content

Flipkart తో తెలంగాణ సెర్ప్ ఒప్పందం

Flipkart inks MoU with Telangana's SERP to enable market
Flipkart inks MoU with Telangana's SERP to enable market

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా బృందాల) తయారు చేసే ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంస్థ (సెర్ప్) ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ ఏడాది రూ.500 కోట్ల వ్యాపారం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 140 రకాల ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించేందుకు వీలుంటుంది.  

Also read: GK Economy Quiz: US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట రికార్డు ఎంత?

అలాగే.. రాష్ట్రంలో 3,70,825 మహిళా స్వయం సహాయక సంఘాలకు 2022–23 ఏడాదిలో రూ.15 వేల కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకు 31,303 సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.1,600 కోట్లకు పైగా రుణాలు ఇచ్చారు. మిగతా లక్ష్యాన్ని 2023 మార్చిలోగా సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నారు. సెర్ప్‌ ద్వారా గత ఎనిమిదేళ్లలో (2014–15 నుంచి 2021–22 వరకు) డ్వాక్రా బృందాలకు రూ.56,004 కోట్ల బ్యాంకు రుణా లు కల్పించినట్లు పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. 

Published date : 30 Jun 2022 06:26PM

Photo Stories