Skip to main content

Steel Mills: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో జత కట్టిన దేశీ సంస్థ?

Posco - Adani

స్టీల్, పునరుత్పాదక ఇంధన విభాగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలుగా దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌ చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై రెండు సంస్థల ప్రతినిధులూ సంతకాలు చేశారు. గుజరాత్‌లోని ముంద్రాలో కొత్తగా పర్యావరణ అనుకూల స్టీల్‌ ప్లాంటు నెలకొల్పడంతో పాటు #నరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, లాజిస్టిక్స్‌ వంటి పలు రంగాలలో 5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.37,500 కోట్లు) పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ఈ ప్రాథమిక ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం పునరుత్పాదక విద్యుత్, హైడ్రోజన్, రవాణా వంటి వివిధ పరిశ్రమల్లోనూ ఇరు సంస్థల భాగస్వామ్యానికి అవకాశం ఉంది. ఏ సంస్థ ఎంత పెట్టుబడులు పెడుతోంది, భాగస్వామ్య వివరాలను వెల్లడించలేదు.

GK Economy Quiz: షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌గా RBI ఆమోదం పొందిన బ్యాంక్?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) చేసుకున్న దేశీ దిగ్గజం?
ఎప్పుడు : జనవరి 14
ఎవరు    : అదానీ గ్రూప్‌
ఎందుకు : భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్టీల్, పునరుత్పాదక ఇంధన విభాగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలుగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Jan 2022 04:21PM

Photo Stories