ఏ దేశ ప్రజలకు అత్యవసర వీసాలు జారీ చేస్తామని భారత్ ప్రకటించింది?
మతంతో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్ పౌరులు ఎవరైనా సరే వీసాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తులను ఢిల్లీలో పరిశీలించనున్నట్లు తెలిపింది. అఫ్గాన్లోనెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో వీసా నిబంధనలను కేంద్ర హోంశాఖ సమీక్షించిందని, అఫ్గాన్ పౌరులను భారత్లోకి అనుమతించడానికి ఎలక్ట్రానిక్ వీసా అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టిందని అధికారులు తెలిపారు. అఫ్గాన్లో భారత రాయబార కార్యాలయం మూతపడిందని, అందుకే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. అఫ్గాన్లకు ఇచ్చే అత్యవసర ఈ–వీసా ఆరు నెలల పాటు చెల్లుబాటులోఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :అఫ్గానిస్తాన్దేశ ప్రజలకు అత్యవసరవీసాలు జారీ చేస్తామని ప్రకటించిన దేశం?
ఎప్పుడు : ఆగస్టు17
ఎవరు :భారత్
ఎందుకు :అఫ్గానిస్తాన్ను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత పరిస్థితులు విషమిస్తున్న నేపథ్యంలో...