Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 4th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu August 4th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu August 4th 2022
Current Affairs in Telugu August 4th 2022

TS Highcourt న్యాయమూర్తిగా విజయభాస్కర్ రెడ్డి 

ప్రభుత్వ న్యాయవాది చాడ విజయభాస్కర్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులను నియమించాలని సీజేఐ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు కొలీజి యం ఫిబ్రవరి తొలి వారంలో కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిలో 10 మందికి నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మార్చి 22న ఆమోదముద్ర వేశారు. మిగిలిన ఇద్దరిలో ఒకరైన చాడ విజయభాస్కర్‌రెడ్డికి ఆగస్టు 3న ఆమోదముద్ర పడింది. ఆగస్టు 4న హైకోర్టులోని ఫస్ట్‌కోర్టు హాల్‌లో చాడ విజయభాస్కర్‌రెడ్డితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 3rd కరెంట్‌ అఫైర్స్‌

జస్టిస్‌ చాడ నేపథ్యమిది
1968, జూన్‌ 28న ఉమ్మడి మెదక్‌ జిల్లా దుబ్బాకలో పుష్పమ్మ, కేశవరెడ్డి దంపతులకు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1992, డిసెంబర్‌ 31న బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. జస్టిస్‌ వీవీఎస్‌ రావు దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1999లో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డీ), స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2006 నుంచి 2009 మధ్య కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. 2010–15 మధ్య వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2014 నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సీజేతో కలిపి 27 ఉండగా... చాడ రాకతో ఈ సంఖ్య 28కి చేరనుంది. అలాగే.. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం గత వారం సిఫార్సు చేసిన ఆరుగురికి ఆమోదం లభిస్తే ఈ సంఖ్య 34కు చేరనుంది. ఈ నేపథ్యంలో మొత్తం 42 మందిలో మరో 8 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి  ఉంటుంది. 
 

అమెరికా Taiwan పర్యటనతో China ఆగ్రహం 

‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తైవాన్‌ తన భూభాగమేనని, దానితో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోరాదని చెబుతున్న చైనా ఈ పరిణామంపై మండిపడింది. ‘‘పెలోసీ నిప్పుతో చెలగాటమాడారు. అది అమెరికానే కాల్చేస్తుంది.  తీవ్ర పరిణామాలుంటాయి. చేతులు ముడుచుకుని కూర్చోం’’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్‌ స్పందించారు. ఈ తప్పిదానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘చైనా సార్వభౌమాధికారాల పరిధిని, ప్రాదేశిక సమగ్రతను అమెరికా ఉల్లంఘించింది. తైవాన్‌ జలసంధి వద్ద శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీసింది’’ అని విమర్శించారు. ‘‘చైనాను నిలువరించేందుకు తైవాన్‌ అంశాన్ని వాడుకోవడాన్ని అమెరికా ఇకనైనా కట్టిపెట్టాలి. తైవాన్‌ స్వాతంత్య్ర డిమాండ్లకు మద్దతివ్వొద్దు’’ అని డిమాండ్‌ చేశారు. 

Also read: Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీలో 191 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

తైవాన్‌పై ఆంక్షలకూ చైనా తెర తీసింది. పళ్లు, చేపల దిగుమతులు, ఇసుక ఎగుమతులపై నిషేధం విధించింది. 

తైవాన్‌ చుట్టూరా సైనిక విన్యాసాలు 
పెలోసీ పర్యటనకు సమాధానంగా తైవాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆగస్టు 2న  తెరతీసిన భారీ సైనిక విన్యాసాలను చైనా మరింత తీవ్రతరం చేసింది. తైవాన్‌ జలసంధిలోకి మరిన్ని యుద్ధ నౌకలను తరలించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలు, విన్యాసాల జోరు పెంచి అమెరికాకు హెచ్చరిక సంకేతాలు పంపింది. చైనా ఫైటర్‌ జెట్లు తైవాన్‌ గగనతలం సమీపంలో విన్యాసాలకు దిగాయి. ఆగస్టు 4 నుంచి నాలుగు రోజుల పాటు తైవాన్‌ ద్వీపం చుట్టూ మరిన్ని సైనిక విన్యాసాలుంటాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువా ప్రకటించింది. ఇవి యుద్ధానికి దిగడంతో సమానమని పరిశీలకులంటున్నారు. బలప్రయోగంతోనైనా తైవాన్‌ను తనలో కలిపేసుకునే చర్యలకు చైనా దిగనుందనేందుకు ఇవి సంకేతాలేనంటున్నారు. చైనా చర్యలను తైవాన్‌ తీవ్రంగా నిరసించింది. ‘‘మేం జడిసేది లేదు. సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుని తీరతాం’’ అని తైవాన్‌ అధ్యక్షురాలు ఇంగ్‌ వెన్‌ అన్నారు.  

World under - 20 Atheletics భారత రిలే జట్టుకి రజతం 

కొలంబియాలోని కలిలో జరుగుతున్న ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత మిక్స్‌డ్‌ రిలే జట్టు 4X400 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపల్‌ చౌదరీలతో కూడిన భారత జట్టు రేసును 3 నిమిషాల 17.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్‌ అండర్‌–20 అథ్లెటిక్స్‌లో భారత మిక్స్‌డ్‌ టీమ్‌ మెరుగైన ప్రదర్శనతో పతకంతో నిలబెట్టుకుంది. గతేడాది నైరోబీలో మొదటిసారిగా నిర్వహించిన ప్రపంచ అండర్‌ –20 అథ్లెటిక్స్‌లో మిక్స్‌డ్‌ జట్టు కాంస్యం గెలిచింది. అప్పుడు రూపల్‌ మినహా భరత్, ప్రియా, కపిల్‌ ముగ్గురు కాంస్యం గెలిచిన బృందంలో ఉన్నారు.
CWG 2022 : బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్ కు రజతం  

జూడోలో రజతం... వెయిట్‌లిఫ్టింగ్, స్క్వాష్‌లలో కాంస్యాలు దక్కగా... ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా ఈసారి ఫైనల్లో 1–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట 18–21, 15–21తో టెంగ్‌ ఫాంగ్‌ చియా–వుయ్‌ యిక్‌ సో ద్వయం చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22–20, 21–17తో జిన్‌ వె గోపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో 14వ ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 19–21, 21–6, 16–21తో ప్రపంచ 42వ ర్యాంకర్‌ జె యోంగ్‌ ఎన్జీ చేతిలో ఓడిపోయాడు. నాలుగో మ్యాచ్‌లో థినా మురళీథరన్‌–కూంగ్‌ లె పియర్లీ ద్వయం 21–18, 21–17తో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటను ఓడించి మలేసియాకు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. కాంస్య పతక పోరులో సింగపూర్‌ 3–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది.

Also read: Quiz of The Day (August 03, 2022): భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది?

పురుషుల స్క్వాష్ లో భారత ఆటగాడు సౌరవ్‌ ఘోషాల్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో స్క్వాష్‌ సింగిల్స్‌లో విభాగంలో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్‌ సౌరవ్‌ 11–6, 11–1, 11–4 తేడాతో మాజీ నంబర్‌వన్‌ జేమ్స్‌ విల్రస్టాప్‌ (ఇంగ్లండ్‌)ను చిత్తు చేశాడు. 2018 క్రీడల్లో దీపిక పల్లికల్‌తో కలిసి సౌరవ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రజతం గెలుచుకున్నాడు.  

Also read: Quiz of The Day (August 04, 2022): దేశంలో తుపానులకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం?

వెయిట్‌లిఫ్టింగ్‌ 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్‌ స్నాచ్‌లో వరుసగా మూడు ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం (163+192)355 కేజీలతో ప్రీత్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్‌ పెరిక్లెక్స్‌ (కామెరూన్‌; 361 కేజీలు) స్వర్ణం సాధించగా, జాక్‌ ఒపెలాజ్‌ (సమోవా; 358 కేజీలు) రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశే ఎదురైంది. మూడు ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె ఆరో స్థానంతో ముగించింది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 04 Aug 2022 05:46PM

Photo Stories