Skip to main content

ఆరేళ్లు పూర్తి చేసుకున్న ‘షీ టీమ్’

మహిళల భద్రత కోసం వినూత్న అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఇప్పటికే దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నట్లు విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు.
Current Affairs

ఆడపిల్లల భద్రతకు ప్రాముఖ్యమిస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. షీ టీమ్స్ ఆరేళ్లు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఏడో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన మీడియాతో మాట్లాడారు. ఈ ఆరేళ్లలో రాష్ట్రంలో నమోదైన ఎన్నో కీలక కేసులను పరిష్కరిస్తూ షీ టీమ్స్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. 2014 అక్టోబర్ నుంచి 2020 అక్టోబర్ వరకు మహిళలకు సంబంధించి మొత్తం 30,187 కేసులు షీ టీమ్స్ వద్దకు రాగా వీటిలో 3,144 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిందని వివరించారు.

క్విక్ రివ్వూ :
ఏమిటి : ఆరేళ్లు పూర్తి చేసుకున్న ‘షీ టీమ్’
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : ఆడపిల్లల భద్రతకు..

Published date : 26 Oct 2020 04:37PM

Photo Stories