Skip to main content

AP govt MOU with ETS: సర్కారు బడిలో ‘టోఫెల్‌’ ట్రైనింగ్‌

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్‌’ పరీక్షకు సన్నద్ధం చేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్విసెస్‌ (ఈటీఎస్‌)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
AP govt MOU with ETS
AP govt MOU with ETS

సీఎం జగన్‌ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఈటీఎస్‌’ ఇండియా చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ లెజో సామ్‌ ఊమెన్, సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఒప్పందంలో ముఖ్యాంశాలు:


♦ టోఫెల్‌ పరీక్షలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌తో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమం. 
♦ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్, యూరోపియన్‌ ఉచ్ఛారణలో పిల్లల నైపుణ్యాలను పెంపొందిస్తారు. 
♦ విదేశీ యాసను అర్థం చేసుకోవడమే కాకుండా విద్యార్థులు చక్కగా మాట్లాడేలా శిక్షణ ఇస్తారు. 
♦ 3, 4వ తరగతి పిల్లలకు విద్యా సంవత్సరం చివరలో మార్చిలో సర్టిఫైడ్‌ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. 
♦  5వ తరగతి పిల్లలకు అక్టోబరులో మరో సన్నాహక పరీక్ష అనంతరం మార్చిలో తుది పరీక్ష టోఫెల్‌ ప్రైమరీని నిర్వహిస్తారు. 

Daily Current Affairs in Telugu: 24 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

♦  6 – 8వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరిలో సర్టిఫైడ్‌ సన్నాహక పరీక్ష ఉంటుంది. 
♦ 9వ తరగతి విద్యార్థులకు అక్టోబరులో మరో సర్టిఫైడ్‌ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. తుది పరీక్ష టోఫెల్‌ జూనియర్‌ విద్యా సంవత్సరం చివరిలో జరుగుతుంది. 
♦ 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్‌ జూని­యర్‌ స్పీకింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 
♦పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా 3 – 5 తరగతుల వారికి వారానికి మూడుసార్లు గంట సేపు స్మార్ట్‌ టీవీల ద్వారా ఆడియో, వీడియో కంటెంట్‌ను వినిపిస్తారు.  
♦ 6 – 10వ తరగతి పిల్లలకు ఐఎఫ్‌పీల ద్వారా వారా­నికి మూడుసార్లు వీడియోలు ప్రదర్శిస్తారు. 
♦ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు. 
♦  అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు చదివే స్కూళ్లలో ఇంగ్లిష్‌ టీచర్లను మెరుగైన శిక్షణ, అవగాహన కోసం అమెరికాలోని ప్రిన్స్‌­టన్‌కు మూడు రోజులపాటు పంపిస్తారు. 
♦  ఒప్పందంలో భాగంగా టోఫెల్‌ పరీక్షలను సీనియర్‌ లెవెల్‌కూ (ప్లస్‌ –1, ప్లస్‌ –2) విస్తరించాలని సీఎం ఆదేశించారు. 

Daily Current Affairs In Telugu: 23 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

Published date : 24 Jun 2023 03:17PM

Photo Stories