Wally Adeyemo: రష్యాపై ఆంక్షలను భారత కంపెనీలు ఉల్లంఘించలేదు
![Us Deputy Secretary Of Treasury Wally Adeyemo](/sites/default/files/images/2022/08/27/wali-aadami-1661603299.jpg)
భారత్తోపాటు అమెరికా, యూరోప్ సహా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఆంక్షలను సీరియస్గా తీసుకుని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆంక్షలకు విరుద్ధంగా భారత్ రష్యా చమురును దిగుమతి చేసుకుని, శుద్ధి తర్వాత ఎగుమతి చేస్తోందని అమెరికా ఆందోళన చెందుతున్నట్టు RBI డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్ర ఇటీవలే పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన అదేమో భారత్కు మద్దతుగా ఆగష్టు 24 న మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా, ఉక్రెయిన్తోపాటు ద్వైపాక్షిక అంశాలపై భారత అధికారులతో చర్చించనున్నట్టు చెప్పారు. ‘‘అమెరికా ఆధ్వర్యంలో రష్యాపై విధించిన ఆంక్షలు విస్తృతమైనవి. వీటి అంతిమ లక్ష్యం చమురు ఎగుమతుల ద్వారా రష్యాకు వచ్చే ఆదాయాన్ని తగ్గించడమే. అదే సమయంలో ఇంధన సరఫరా సజావుగా ఉండేలా చూడడం’’అని చెప్పారు. భారత కస్టమర్లు ఇంధనం కోసం ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP