Skip to main content

Swachh survekshan awards 2022: దేశంలో ఎక్కువ అవార్డులు సాధించిన రెండో రాష్ట్రం తెలంగాణ

- అవార్డులు సాధించిన ప్రతి మున్సిపాలిటీకి రూ.2 కోట్లు
TS is the second state with the highest number of awards in the country
TS is the second state with the highest number of awards in the country

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులు సాధించిన మున్సిపాలిటీలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు, పట్టణాలను ప్రోత్సహించేందుకు ఈ నిధులను ఇస్తున్నామని, వీటిని ప్రత్యేకంగా పారిశుధ్యం కోసం వినియోగించాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులు సాధించిన మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, కమిషనర్లను అభినందిస్తూ హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో అక్టోబర్ 4న ప్రత్యేక కార్యక్రమం జరిగింది.  

Also read: Weekly Current Affairs (National) Bitbank: రాష్ట్రంలోని రైతులకు ఆధార్ నంబర్‌తో సమానమైన ప్రత్యేక వ్యవసాయ IDని ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది?

కేటీఆర్‌ దీనికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బడంగ్‌పేట్, కోరుట్ల, సిరిసిల్ల, తుర్కయాంజాల్, గజ్వేల్, వేములవాడ, ఘట్‌కేసర్, కొంపల్లి, హుస్నాబాద్, ఆదిభట్ల, కొత్తపల్లి, చండూర్, నేరేడుచర్ల, చిట్యాల, భూత్పూర్, అలంపూర్, పీర్జాదిగూడలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా అవార్డులు సాధించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.   

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 64వ రామన్ మెగసెసే అవార్డు 2022 గ్రహీతలు ఎవరు?

Published date : 06 Oct 2022 06:07PM

Photo Stories