Mahaveer Chakra కల్నల్ సంతోష్బాబు సతీమణికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారం
Sakshi Education
![KCR announces Rs 5 crore for Colonel Santosh's family,](/sites/default/files/images/2022/06/30/telangana-2-1656595421.jpg)
చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ బి.సంతోష్ బాబు సతీమణి బి.సంతోషికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. సంతోష్బాబు మరణానంతరం ప్రతిష్టాత్మకమైన ‘మహావీర్ చక్ర’ పురస్కారానికి ఎంపికైనందున .. నిబంధనల మేరకు ఈ నగదును మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బి.సంతోషికి ఈ నగదును అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు.
Published date : 30 Jun 2022 06:53PM