Skip to main content

Innovative Farmer Award: రఘువీర్‌కు ‘వినూత్న రైతు’ అవార్డు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన అభ్యుదయ యువ రైతు నందం రఘువీర్‌కు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ) ప్రతిష్టాత్మకమైన వినూత్న రైతు అవార్డు-2024ను అందించింది.
Innovative Farmer Award to Raghuveer

న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) మేళాలో ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌ కమ్‌ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఏకే సింగ్‌ ఈ అవార్డును రఘువీర్‌కు ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ రైతుగా రఘువీర్‌ గుర్తింపు పొందారు.

రఘువీర్‌ సాధించిన విజయాలు..
✦ అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను సంరక్షించాలనే సంకల్పంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి దేశవ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించాడు.
✦ వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్‌ కలిగిన వంగడాలు కూడా ఉన్నాయి.
✦ పెనమలూరులో తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో తాను సేకరించిన పురాతన విత్తనాలతో విత్తన సంరక్షణ చేస్తున్నాడు.
✦ ఎనిమిది జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేశాడు.
✦ ఏజెన్సీ ప్రాంతమైన పెదబయలు మండలంలో పురాతన దేశీ విత్తన నిధిని ఏర్పాటు చేశాడు.
✦ గిరిజన రైతులకు పురాతన వంగడాలను ఉచితంగా అందిస్తూ వాటి పునరుత్పత్తికి కృషి చేస్తున్నాడు.

UK's Royal Award: భారతీయ యువ రిక్షా డ్రైవర్‌కి లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డు!

రఘువీర్‌కు లభించిన అవార్డులు ఇవే..
✦ గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ మొక్కల జన్యురక్షకుని అవార్డు
✦ మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జాతీయ ఉత్తమ రైతు అవార్డు
✦ 2022లో మిజోరాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉత్తమ రైతు అవార్డులు

Published date : 10 Jun 2024 09:02AM

Photo Stories