రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మే 14, 15 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు
ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు జనవరి 24న ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్లోనూ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మే 14వ తేదీన ఉదయం పేపర్–3కి సంబంధించి పరీక్ష ఉంటుంది. 15న ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష జరుగుతుంది.