సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన వారి జాబితాలను Andhra Pradesh Public Service Commission (APPSC) ఫిబ్రవరి 10న విడుదల చేసింది.
వివిధ పోస్టులకు ఎంపికైన వారి జాబితా విడుదల
వీటిని కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో పొందుపరిచింది. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, సెరికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ టెక్నికల్ అసిస్టెంట్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను వెబ్సైట్లో చూడొచ్చని తెలిపింది. ఈ పోస్టులకు ఎంపికైన వారి ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ఫిబ్రవరి 21న నిర్వహిస్తామని వెల్లడించింది.