Skip to main content

శాతవాహనులు-ముఖ్యాంశాలు

  • ఆంధ్ర శబ్దాన్ని పేర్కొంది - ఐతరేయ బ్రాహ్మణం
  • ఆంధ్ర పథాన్ని ప్రస్తావించింది - భీమసేన జాతకం
  • ఆంధ్ర నగరిని పేర్కొంది - సెరివణిజ జాతకం
  • త్రిలింగ దేశాన్ని ప్రస్తావించింది - శక్తి సంగ్రమ తంత్రం
  • శాతవాహనులు, పురాణాల్లో పేర్కొన్న ఆంధ్ర భృత్యులు ఒకరేనని ఆర్.జి.భండార్కర్ అభిప్రాయపడ్డారు.
  • శాతవాహనుల ఆదిమ నివాసం నాసిక్ ప్రాంతమని పి. శ్రీనివాస అయ్యంగార్ గోపాలాచారి, పులాస్కర్ పేర్కొన్నారు.
  • వి.ఎన్.సుంక్తాంకర్ అభిప్రాయంలో శాతవాహనుల తొలి నివాసం ‘బళ్లారి’ ప్రాంతం.
  • శాతవాహనులు గోదావరి, కృష్ణా, మండల వాసులని వి.ఎ.స్మిత్, రాయ్ చౌదరి, గుత్తి వెంకట్రావ్‌లు అభిప్రాయపడ్డారు.
  • ‘వాసుదేవ విష్ణు మిరాసీ’ అభిప్రాయంలో శాతవాహనుల జన్మభూమి విదర్భ ప్రాంతం.
  • శాతవాహనుల ప్రాచీన రాజధాని శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) ఆ తర్వాత వరుసగా ధాన్యకటకం, ప్రతిష్టానపురాలని ఎల్.డి.బార్నెట్ అభిప్రాయపడ్డారు.
  • సంస్కృత భాషలో ‘శర్వవర్మన్’ కాతంత్ర వ్యాకరణం రచించాడు.
  • ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖ గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు.
  • ప్రాకృత భాషలో హాలుడు రచించిన గ్రంథం‘గాథాసప్తశతి’.
  • నానాఘట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య నాగనిక వేయించింది.
  • నాసిక్ శిలా శాసనాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బాలాశ్రీ వేయించింది.
  • హతిగుంఫా శిలాశాసనాన్ని - కళింగాధిపతి ఖారవేలుడు (ఒడిశా) వేయించాడు.
  • క్రీ.శ.150లో శకరాజైన రుద్రదమనుడు మొట్ట మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన శాసనం ‘గిర్నార్ శాసనం’
  • శాతవాహన రాజ్య స్థాపకుడు - శ్రీముఖుడు
  • రెండు అశ్వమేధ, ఒక రాజసూయ యాగం చేసిన శాతవాహన రాజు - మొదటి శాతకర్ణి
  • మొదటి శాతకర్ణికి గల బిరుదులు - దక్షిణాపథపతి, ఏక వీరుడు, శూరుడు
  • కార్షాపణులు అంటే - వెండి నాణేలు
  • మధ్యప్రదేశ్‌లో ఉన్న సాంచీ స్థూపానికి దక్షిణ తోరణ ద్వారాన్ని నిర్మించిన శాతవాహన రాజు - రెండో శాతకర్ణి
  • ఏ శాతవాహన రాజు కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజ భాష అయింది?
    - కుంతల శాతకర్ణి
  • 17వ శాతవాహన రాజైన హాలుడికి గల బిరుదు?
    - కవి వత్సలుడు
  • లీలావతి పరిణయ కావ్యాన్ని రచించింది - కుతూహలుడు
  • కావ్య మీమాంస గ్రంథాన్ని రచించింది - రాజశేఖరుడు
  • నహపాణుని రాజధాని - మిన్నగార
  • ‘క్షహరాట వంశ నిరవశేషకర’అనే బిరుదు ఎవరికి ఉంది?
    - శకరాజైన నహపాణుడికి
  • క్షత్రియ దర్పమాన, త్రిసముద్రతోయ పీతవాహన, ఏకబ్రాహ్మణ, ఆగమనిలయ అనే బిరుదులున్న శాతవాహన రాజు?
    - గౌతమీపుత్ర శాతకర్ణి
  • నహపాణుడు (శకరాజు) వేయించిన వెండి నాణేలు ఎక్కడ లభించాయి?
    - మహారాష్ర్టలోని జోగల్‌తంబిలో
  • నాణేలపై ఓడ బొమ్మలు ముద్రించిన శాతవాహన రాజు?
    - యజ్ఞశ్రీ శాతకర్ణి
  • పురుషార్థాలు అంటే - ధర్మ, అర్థ, కామ, మోక్షాలు
  • ఆహారాలు అంటే - రాష్ట్రాలు
  • నిగమాలు అనగా?
    - ప్రధాన నగరాలు
  • గ్రామిణి, గుల్మిక, గ్రామిక పదాలు దేన్ని సూచిస్తాయి?
    - గ్రామ పరిపాలనాధికారిని
  • ఒక వృత్తిని అనుసరించే వారిని శ్రేణులు (సంఘాలు)అంటారు. దీని అధ్యక్షుడు శ్రేష్టి
  • స్కంధావారం అంటే - సైనిక శిబిరం
  • సాగుభూమిని కొలిచేందుకు ‘రజ్జు’ అనే కొలమానాన్ని వాడేవారు. భూమి కొలతలు, లావాదేవీలను పర్యవేక్షించే వారిని రజ్జు గాహకుడు అనేవారు.
  • వృత్తి పనులవారు కరుకర అనే పన్నును చెల్లించేవారు.
  • దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ‘భూదానం’ చేయడం అనే ప్రక్రియను శాతవాహనులే ప్రారంభించారు.
  • కుటుంబ పెద్దను గహపతి (గృహపతి) అని పిలిచేవారు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చిహ్నం పూర్ణ కుంభాన్ని అమరావతి స్థూపంనుంచి తీసుకున్నారు.
  • మధ్యప్రదేశ్‌లోని ‘విదిశ’ ప్రాంతంలో హోలియో డోరస్ క్రీ.పూ.1వ శతాబ్దంలో వేసిన స్తంభ శాసనం భాగవత మతం గురించి ప్రస్తావించింది.
  • ఆంధ్ర దేశంలో అతి ప్రాచీనమైన గుడి మల్లం శివలింగం చిత్తూరు జిల్లాలో లభ్యమైంది.
    ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన స్థూపం (క్రీ.పూ.2వ శతాబ్దం) ‘భట్టిప్రోలు’ (గుంటూరు జిల్లా)లో లభించింది.
  • పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహాలయాలు శాతవాహనుల కాలంలో నిర్మాణమయ్యాయి.
  • శాతవాహన రాజుల ఆజ్ఞలను అమలు చేయటానికి ‘అక్ష పటలం’ అనే సచివాలయం ఉండేది.
  • శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు అజంతాలోని 9.10 గుహల్లో ఉన్నాయి.
  • చైత్యగృహాలు అంటే బౌద్ధుల ప్రార్థనా స్థలాలు.
  • తిలపిష్టకులు అంటే ఎవరు?
    - తెలకలివాళ్లు (గానుగ ద్వారా నూనె తీసేవారు)
  • గధికులు అంటే - మందులు తయారుచేసేవారు
  • సార్థవాహులు అంటే ఎవరు?
    ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తువులు తీసుకొనిపోయి వ్యాపారం చేసేవారు
  • కోలికులు అంటే - సాలెవారు
  • ఒసకరులు అంటే - మేదర్లు
  • వజ్రయానం అంటే - బుద్ధుడిని తాంత్రిక పూజా విధానంలో పూజించడం
  • శాతవాహనుల ప్రధాన ఆదాయం భూమిశిస్తు. పంటలో 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు.
  • కొండ కుందాచార్యుడు ‘సమయసారం’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడు శాతవాహన రాజుల సమకాలికుడు.
  • ‘కథా సరిత్సాగరం’ను సంస్కృత భాషలో ‘సోమదేవసూరి’ రచించాడు.
  • బృహత్కథా శ్లోక సంగ్రహం రచయిత - బుధస్వామి
  • మహాయాన మాధ్యమిక సిద్ధాంత కర్త - ఆచార్య నాగార్జునుడు
Published date : 11 Aug 2016 12:01PM

Photo Stories