సాక్షి, అమరావతి: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ బోర్డు అధికారులను ఆదేశించారు.
ఇంటర్ ఫెయిలైనవారికి భరోసా
ఈ మేరకు విద్యా శాఖ ఏప్రిల్ 28న సర్క్యులర్ జారీ చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ శాఖల ఆధీనంలో పనిచేస్తున్న కళాశాలల్లోని విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని మంత్రి బొత్స సూచించారు. మే 1 నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు శిక్షణ ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.