Skip to main content

Students Exams : విద్యార్థులు ప్ర‌శాంతంగా ప‌రీక్ష‌లు రాయాలి..

Encouragement for tenth and inter students for board exams

కై లాస్‌నగర్‌: రానున్న రోజుల్లో విద్యార్థుల‌కు ప‌దో త‌ర‌గతి, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మ‌యంలో విద్యార్థుక‌లు ఎంత ప్ర‌శాంతంగా ఉంటే అంత సులువుగా వారి ప‌రీక్ష‌ల‌కు సిద్ధమ‌వ్వ‌చ్చు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి రవీందర్‌కుమార్‌ సూచించారు.

Schools: రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో ఈ స‌మ‌స్య‌.. తీర్చేది ఎలా!

శుక్రవారం జైనథ్‌ మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌, కాలేజీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పరీక్షల సన్నద్ధత గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఏవై న సందేహాలుంటే 14416, 1800 914 416 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్‌ మురళి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 08 Feb 2025 03:29PM

Photo Stories