Skip to main content

Open School: దూరవిద్య టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు

ఏపీ ఓపెన్ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో 2021–22 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది.
Open School
దూరవిద్య టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు

గుంటూరులో సెప్టెంబర్‌ 27న ప్రవేశాల నోటిఫికేషన్ ను సొసైటీ డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 25లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు తుది గడువు అక్టోబర్‌ 27 అని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు అన్ని జిల్లాల్లోని గుర్తింపు పొందిన స్టడీ సెంటర్లతోపాటు https://apopenschool.ap.gov.in ను సందర్శించాలని కోరారు. 

Published date : 28 Sep 2021 12:30PM

Photo Stories