ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన AP EAPCET 2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్ తుది విడత ప్రక్రియ అక్టోబర్ 19 నుంచి ప్రారంభిస్తున్నట్లు సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి అక్టోబర్ 17న ఒక ప్రకటనలో తెలిపారు.
తుదివిడత కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
అక్టోబర్ 19 నుంచి 21 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్ 19 నుంచి 22 వరకు ఆప్షన్ల నమోదు, 23న ఆప్షన్ల సవరణ, 26న సీట్ల కేటాయింపు చేస్తారని తెలిపారు.
26 నుంచి 31వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో చేరిక ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 79956 81678, 79958 65456 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.