తనకు సమీపంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో సీటు ఇప్పించాలని ఓ చిన్నారి మే 9న స్పందనలో అర్జీ ఇచ్చింది.
అంబేడ్కర్ గురుకుల స్కూల్లో సీటు ఇప్పించరూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న స్పందనకు రాయచోటి పరిధిలోని బోయపల్లెలో నాల్గో తరగతి చదువుతున్న చిన్నారి హేమశ్రీ వచ్చింది. నేరుగా అర్జీని కలెక్టర్ పీఎస్ గిరీషాకు అందించింది. తాను ప్రస్తుతం నాల్గో తరగతి తమ ఊరిలోని ఎంపీయూపీ స్కూల్లో పూర్తి చేశానని.. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో తనకు సీటు ఇప్పించాలని కోరింది. సంబంధిత అధికారిని పిలిచి కలెక్టర్ మాట్లాడారు. తప్పకుండా సీటు ఇప్పిస్తామంటూ చిన్నారికి భరోసా ఇచ్చారు.