Tenth Class Exam Fees: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుకు తేదీ విడుదల
Sakshi Education
ఏపీలో టెన్త్ విద్యార్థుల పరీక్షలకు ఫీజు చెల్లించాలని, తేదీతో పాటు తదితర వివరాలను విడుదల చేశారు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్..
Tenth exams for AP students
సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైంది. శనివారం నుంచి నవంబర్ 10వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
11వ తేదీ నుంచి 16 వరకు రూ.50, 17వ తేదీ నుంచి 22 వరకు రూ.200, 23వ తేదీ నుంచి 30 వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల హెచ్ఎంలు నిర్ణిత సమయంలో ఫీజులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని తెలిపారు.