Skip to main content

దశలవారీగా ప్రత్యక్ష బోధన: జూలై 1 నుంచి 8, 9, 10 క్లాసులు.. ఆ తర్వాత..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యాబోధనను దశలవారీగా చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
జూలై 1 నుంచి బడులను ప్రారంభించాలని ఇప్పటికే కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 8, 9, 10 తరగతులకు జూలై 1 నుంచి విద్యా బోధనను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్లు తెలిసింది. 6, 7 తరగతు లకు జూలై 20 నుంచి బోధనను చేపట్టాలని, 3, 4, 5 తరగతులకు ఆగస్టు 16 నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేలా ప్రతిపాదించింది.

చ‌ద‌వండి: హెచ్‌సీయూ – 2021 ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదల

ఒకటి, రెండో తరగతుల అంశాన్ని ప్రస్తావించలేదు. పాఠశాలల్లో విద్యా బోధనకు అవసరమైన మార్గదర్శకాల కోసం విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనలపై సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. దాదాపు ఆ షెడ్యూలు ప్రకారమే ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాశాఖ గురుకులాలతోపాటు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, విద్యాశాఖ పరిధిలోని గురుకులాలను కూడా ప్రారంభించాల్సి ఉన్నందున సన్నద్ధతపై ఆయా శాఖల మంత్రులతోనూ చర్చించాకే ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారు. రెండు మూడు రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కాగా, ఈనెల 25 నుంచి బడులకు హాజరయ్యే ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మోడల్‌స్కూళ్లు, కేజీబీవీలు, విద్యా శాఖ గురుకులాలు, ఎయిడెడ్‌ స్కూళ్ల టీచర్లు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ లెక్చరర్లు అంతా ఆయా విద్యా సంస్థల్లో రిపోర్టు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన ఆదేశించారు. అందుకు అనుగుణంగా డీఈవోలు, ఆర్జేడీలు చర్యలు చేపట్టాలని సూచించారు.

చ‌ద‌వండి: 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియ‌మిస్తూ ఏపీ స‌ర్కార్ ఉత్తర్వులు

చ‌ద‌వండి: ప్రాథమిక పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలుకు రంగం సిద్ధం..!

చ‌ద‌వండి: జూలై 1లోగా తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్‌
Published date : 22 Jun 2021 01:43PM

Photo Stories