TSPSC గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు!!

టీఎస్‌పీఎస్సీ 2022 ఏప్రిల్‌లో విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

పేపర్‌ లీకేజీలు, నిబంధనల ఉల్లంఘనలు, కొత్త పోస్టుల భర్తీ వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 563 గ్రూప్‌-1 పోస్టులకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇది వరకే వెల్లడించింది.

2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను  రెండుసార్లు రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 60 కొత్త పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్‌ ఇస్తుందని తెలిపింది. కొత్త నోటిఫికేషన్‌లో 563 పోస్టులు ఉండే అవకాశం ఉంది. పరీక్ష తేదీలు, అర్హతలు, సిలబస్‌ తదితర వివరాలను కొత్త నోటిఫికేషన్‌లో తెలియజేస్తారు.

#Tags