Jai Singh Rathod: తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు

ఆదిలాబాద్‌ టౌన్‌: తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుందని రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రా థోడ్‌ అన్నారు.

మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రా ధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న‌ రిమ్స్‌ ఆడిటోరియంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 2020 బ్యాచ్‌ మెడికోలు వైద్యులను శాలువాతో సత్కరించారు.

చదవండి: Rathore Mirabai: ఆడపిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్ఞానం అనే చీకటి నుంచి విద్యార్థులను వెలుగులోకి తీసుకొచ్చేవారే గురువులన్నారు. సమాజంలో గురువులకు ఉన్న గౌరవం మరెవరికీ లేదన్నా రు. ఈ కార్యక్రమంలో రిమ్స్‌ సూపరింటెండెంట్‌ అ శోక్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ విద్యావిల్సన్‌, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సరోజ, వైద్యులు రామకృష్ణ, నరేందర్‌, సందీప్‌, శిరీష్‌, తదితరులు పాల్గొన్నారు.

#Tags