చదువుల సిరికి దాతల అండ

జ్యోతినగర్‌(రామగుండం): ‘అమ్మా.. బతకాలని ఉంది’ శీర్షికన జూలై 31న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చదువుల తల్లి ఆరోగ్యానికి తామున్నామంటూ దాతలు భరోసా కల్పించారు.

జంగాలపల్లె లోని కూనారపు పోశం–వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె సిరి అనారోగ్య పరిస్థితిని తెలసుకున్న గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ పిడుగు సతీశ్‌.. కటుకు నాగయ్య ట్రస్ట్‌ చైర్మన్‌ ప్రవీణ్‌కు సమాచారం అందించారు.

చదవండి: RDO Ratnakumari: విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

ఈక్రమంలో అయితే, వాట్సప్‌ గ్రూపు ద్వారా మిత్ర బృందంతో కలిసి జమచేసిన రూ.52 వేల నగదును ఆగ‌స్టు 6న‌ బాధితురాలి కుటుంబానికి అందజేశారు. మరికొందరు దాతలు ముందుకు రావాల ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పిడుగు సతీశ్‌, కటుకు ప్రవీణ్‌, పర్ష సదానందం, రాజేందర్‌, శేఖర్‌, మహేందర్‌, రమేశ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags