RJD Satyanarayana Reddy: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ఆదిలాబాద్‌ టౌన్‌: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు.

న‌వంబ‌ర్‌ 23న‌ జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బాలాజీనగర్‌లోని ప్రాథమిక పాఠశాల, యూపీఎస్‌ ఎన్జీవో, గజిటెడ్‌ పాఠశాలలను సందర్శించారు. ఉన్నతి కార్యక్రమం అమలు గురించి ఉపాధ్యాయులు, విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు.

చదవండి: High Court: స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించండి

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వందశాతం ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఆయన వెంట సీసీ రాజేశ్వర్‌ తదితరులున్నారు.

#Tags