Job Mela 2024: ఈనెల 22న జాబ్‌మేళా.. వేతనం నెలకు రూ. 30వేల వరకు..

కాకినాడ సిటీ: తమ కార్యాలయంలో ఈ నెల 22న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు. టాటా క్యాపిటల్‌లో లోన్‌ ఆఫీసర్‌, వెంకీ రెసిడెన్సీలో ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌, సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌, ట్రైనీ అకౌంటెంట్‌, టెక్నీషియన్‌ అండ్‌ కుక్‌, అమరావతి టీవీఎస్‌లో అకౌంటెంట్‌, సర్వీస్‌ అడ్వైజర్‌, హెల్పర్లు, టెక్నీషియన్‌, టెలికాలర్‌, శ్రీగోపాల్‌ ఆటోమోటివ్‌లో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, సూపర్‌వైజర్‌, అరబిందో ఫార్మాలో టెక్నీషియన్‌ అండ్‌ కెమిస్ట్‌, రాక్‌మెన్‌ ఇండస్ట్రీస్‌, డిక్సాన్‌, హోండాయ్‌ మోబీస్‌ కంపెనీల్లో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు.

NTPC Recruitment 2024: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకు పైగానే వేతనం

పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, బీటెక్‌ బయో టెక్నాలజీ, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు కాకినాడ కలెక్టరేట్‌ ఆవరణలోని వికాస కార్యాలయానికి సోమవారం ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని లచ్చారావు కోరారు.
 

#Tags