Teachers Posts : ఉపాధ్యాయుల కొరతను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి.. ఉద్యోగ విరమణతో..
గుంటూర్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 1,143 ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు విద్యాశాఖాధికారులు లెక్కలు వేశారు. కాగా గత జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు ఉద్యోగ విరమణలతో ఒక్క గుంటూరు జిల్లాలోనే 300 వరకు పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిలో హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఉన్నారు. గుంటూరు జిల్లాలోని 1,071 ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, అందులో 10 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Students Health : విద్యార్థుల బ్యాగుల భారం.. ఆరోగ్యాలపై భారీ ప్రభావం.. దీనికి మేలు!
#Tags