TGSCHE: ఆగస్టు 1 నుంచి బీఆర్క్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌)లో ప్రవేశా నికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

మండలి చైర్మన్‌ లింబాద్రి నేతృత్వంలో జూలై 24న‌ జరిగిన సమావే శంలో షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ సమావే శంలో మండలి వైస్‌ చైర్మ న్లు మహమూద్, వెంకటరమణ, కార్యదర్శి శ్రీ రాం వెంకటేశ్, టీజీ బీఆర్క్‌ ప్రవేశాల కన్వీనర్‌కుమార్‌ పాల్గొన్నారు.

చదవండి: TS EAPCET 2024 Counselling:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ ..... 75 శాతం సీఎస్‌ఈ ఆప్షన్లే

ఆగస్టు 1 నుంచి 8 వరకు రిజిస్ట్రేషన్‌.. 17, 18 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు.. 21న సీట్ల కేటాయింపు చేపడుతున్నట్లు మండలి తెలిపింది. ఆ తర్వాత రెండో దశ కౌన్సెలింగ్‌ చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. 

#Tags