Thailand Open Title: భారత జోడీకి థాయ్ లాండ్ ఓపెన్ టైటిల్
మే 19న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఈ జంట చైనా జంటపై విజయం సాధించింది..
సాక్షి ఎడ్యుకేషన్: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయి రాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. థాయ్ లాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతలుగా నిలిచారు. మే 19న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఈ జంట.. 21–15, 21–15తో చెన్ యాంగ్–ల్యూయి (చైనా) జంటపై విజయం సాధించింది. వరుస గేమ్లలో ప్రత్యర్థిని చిత్తుచేసిన భారత జోడీ పారిస్ ఒలింపిక్స్కు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టోర్నీల్లో సాత్విక్– చిరాగ్ జోడీకి ఇది తొమ్మిదో టైటిల్ కాగా.. 2024లో రెండోది.
French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే ఓడిపోయిన స్పెయిన్ దిగ్గజం!!
#Tags