Chess Tournament: చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో హంపి, వైశాలి విజయం

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో పోటీపడుతున్న భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి 11వ రౌండ్‌లో విజయం సాధించారు.

సలీమోవా నుర్గుయెల్‌ (బల్గేరియా)తో జరిగిన గేమ్‌లో హంపి 90 ఎత్తుల్లో.. అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా)తో జరిగిన గేమ్‌లో వైశాలి 70 ఎత్తుల్లో గెలిచారు. ఈ టోర్నీలోకి హంపికిది రెండో విజయంకాగా, వైశాలి ఖాతాలో మూడో గెలుపు చేరింది.

11వ రౌండ్‌ తర్వాత హంపి 5.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 4.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఓపెన్‌ విభాగంలో 11వ రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌లకు ఓటమి ఎదురుకాగా, దొమ్మరాజు గుకేశ్‌ ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా) చేతిలో, విదిత్‌ 67 ఎత్తుల్లో నిపోమ్‌నిషి (రష్యా) చేతిలో పరాజయం పాలయ్యారు.

Asian Wrestling Championships 2024: భారత్‌కు మూడు పతకాలు..

గుకేశ్, కరువానా (అమెరికా) గేమ్‌ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. 11వ రౌండ్‌ తర్వాత గుకేశ్‌ 6.5 పాయింట్లతో రెండో స్థానంలో,  ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో 5వ స్థానంలో, విదిత్‌ 5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.

#Tags