India State of Forest Report 2021: అటవీ విస్తీర్ణం పెరుగుదలలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

దేశంలో గత రెండేళ్ళలో అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొద‌టి స్థానంలో నిలిచింది. దేశంలో అటవీ స్థితిగతులకు సంబంధించిన నివేదిక–2021ని కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ జనవరి 13న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం... అటవీ విస్తీర్ణంలో పెరుగుదలను చూపుతున్న మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ (647 చ.కి.మీ) తర్వాత స్థానంలో తెలంగాణ (632 చ.కి.మీ) ఉంది. ఒడిశా (537 చ.కి.మీ) మూడో స్థానంలో నిలిచింది.

తెలంగాణలో 24.05 శాతం..

తెలంగాణలో 2014 నుంచి 2019 వరకు పచ్చదనం (ట్రీ కవర్‌) 361 చదరపు కిలోమీటర్ల మేర పెరిగినట్టుగా ఈ నివేదిక  స్పష్టం చేస్తోంది. 2014తో పోల్చితే 2019 నాటికి ట్రీకవర్‌ 14.51 శాతం వృద్ధి చెందింది. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం 1,12,077 చ.కి.మీల పరిధిలో విస్తరించి ఉండగా అందులో 26,969 చ.కి.మీలలో (24.05 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 730.06 చ.కి. మీ. పరిధిలో దట్టమైన అడవులున్నాయి. ఖమ్మం జిల్లా భౌగోళిక పరిధి 13,266 చ.కి.మీగా ఉంది.

చ‌ద‌వండి: సోలార్‌ విద్యుత్‌ స్థాపిత సామర్ధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అటవీ విస్తీర్ణం పెరుగుదలలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : జనవరి 14 
ఎవరు    : దేశంలో అటవీ స్థితిగతులకు సంబంధించిన నివేదిక–2021
ఎక్కడ    : దేశంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags