Rajesh Verma: వాయు కాలుష్య నిర్వహణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రాజేష్ వర్మ

దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య నిర్వహణ కమిషన్ (CAQM) కొత్త ఛైర్‌పర్సన్‌గా రాజేష్ వర్మ నియమితులయ్యారు.

ఒడిశా కాడర్‌కు చెందిన రాజేష్ వర్మ 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. వర్మ 35 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ పరిపాలన, పాలన రంగంలో విస్తృత అనుభవం కలిగి ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖలలో పనిచేశారు. వర్మ గతంలో కూడా వాయు కాలుష్య నిర్వహణ రంగంలో పనిచేశారు. ఆగస్టు 31వ తేదీ 2024 వరకు ద్రౌపది ముర్ముకు సెక్రటరీగా పనిచేశారు.

సీఏక్యూఎం: దేశ రాజధాని ప్రాంతం, సమీప ప్రాంతాలలో వాయు కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి ఏర్పాటైన ఒక ముఖ్యమైన సంస్థ.

Amit Shah: అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన‌ అమిత్ షా

#Tags