Kargil Vijay Diwas: 4 రోజుల్లో 160 కి.మీ.లు పరిగెత్తిన ఆర్మీ మాజీ అధికారిణి!

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ మాజీ అధికారిణి సాహసోపేతమైన ఫీట్‌ చేశారు.

లెఫ్టినెంట్‌ కల్నల్‌ వర్షారాయ్‌ 4 రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. రన్‌ జూలై 19వ తేదీ ప్రారంభమై జూలై 22న ముగిసింది. 
 
శ్రీనగర్‌ నుంచి ద్రాస్‌ సెక్టార్‌లోని కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌ వరకు ఆమె సగటున రోజుకు 40 కిలో మీట‌ర్లు పరుగెత్తారు. పరుగు పూర్తయిన సందర్భంగా కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆమెతో పాటు చినార్‌ వారియర్స్‌ మారథాన్‌ జట్టు కూడా ఉంది. లెఫ్టినెంట్‌ కల్నల్‌ వర్షా రాయ్‌ భర్త కశ్మీర్‌లో ఆర్మీ అధికారిగా ఉన్నారు.

Vinay Kwatra: అమెరికాలో భారత రాయబారిగా వినయ్‌ క్వాత్రా

#Tags