New Names : రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో మారిన రెండు భ‌వ‌న్ల పేర్లు..!

రాష్ట్రపతి భవన్‌లోని రెండు హాళ్ల పేర్లను మార్చా­రు. దర్బార్‌ హాల్‌ను ‘గణతంత్ర మండపం’గా.. అశోక హాల్‌ను ‘అశోక మండపం’గా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి భవన్‌ వాతావరణాన్ని భారతీయ సాంస్కృతిక విలువలు, తత్వాలను ప్రతిబింబించేలా చేసే ప్రయత్నమే ఇదని వివరించింది. దర్బార్‌ హాల్‌ను జాతీయ అవార్డులు ప్రదానం చేసేందుకు, ముఖ్యమైన వేడుకలు నిర్వహించేందుకు ఉపయోగిస్తుండగా.. అశోక హాల్‌ ఓ బాల్‌రూమ్‌గా ఉపయోగపడుతోంది.

Mann Ki Baat: ‘ఈ దుస్తులు కొనండి’.. పెరిగిన ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు

#Tags