Sharad Yadav: లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ను ఏ పార్టీలో విలీనం చేశారు?

బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ (74) తన నేతృత్వంలోని లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ (ఎల్‌జేడీ)ను రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ )లో విలీనం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్చి 20న ఆయన తెలిపారు. బీజేపీని దీటుగా ఎదుర్కోగల సత్తా ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉందన్నారు. 1997లో దాణా కుంభకోణం బయటపడ్డాక జనతాదళ్‌ పార్టీలో విభేదాల నేపథ్యంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌... 1997, జూలై 5న ఆర్‌జేడీని స్థాపించారు. అప్పట్లో జనతాదళ్‌లో లాలూకు గట్టి పోటీ ఇచ్చే నేతగా శరద్‌ యాదవ్‌ ఉండేవారు. 2018, మే 18వ తేదీన లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ (ఎల్‌జేడీ)ను శరద్‌ యాదవ్‌ స్థాపించారు.

World Peace Center: దేశంలో తొలి ప్రపంచ శాంతి కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ )లో లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ (ఎల్‌జేడీ) పార్టీ విలీనం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు    : బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌
ఎక్కడ    : బిహార్‌
ఎందుకు : బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమని..

Dredging Corporation of India: డీసీఐ డ్రెడ్జ్‌ బ్రహ్మపుత్రను ఎక్కడ తయారు చేయనున్నారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags