Kolkata: మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీని ఎవరు స్థాపించారు?

మదర్‌ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ(ఎంఓసీ)’ ఎన్‌జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను కేంద్ర హోం శాఖ జనవరి 8న పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్‌సీఆర్‌ఏ యాక్ట్‌) చట్టం కింద సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్‌ గ్రహీత మదర్‌ థెరిస్సా 1950లో కోల్‌కతాలో మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ సంస్థను నెలకొల్పారు.

ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ రోజునే ఆ సంస్థ లైసెన్స్‌ రెన్యువల్‌ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. భారత్‌లోని ఏదైనా ఎన్‌జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్‌ తప్పనిసరి.
చ‌ద‌వండి: భద్రతా వైఫల్యంపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీకి లైసెన్స్‌ పునరుద్ధరణ
ఎప్పుడు  : జనవరి 8
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి కల్పించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags