Nitrous Oxide : ప్రమాదకరంగా నైట్రస్‌ ఆక్సైడ్‌ పెరుగుదల

1980–2020 మధ్య వాతావరణంలో భూతాపాన్ని పెంచే నైట్రస్‌ ఆక్సైడ్‌ (ఎన్‌2ఓ) ఉద్గారాల పెరుగుదల 40 శాతం ఉండటం ఆందోళన కలిగించే విషయమని తాజా నివేదిక వెల్లడించింది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఈ ఉద్గారాల పెంపులో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత భారత్, అమెరికా దేశాలు ఉన్నట్టు వాతావరణ శాస్త్రజ్ఞుల బృందంతో కూడిన గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్టు తెలుపుతోంది. ఇటీవల చేపట్టిన ఈ పరిశోధనల ప్రకారం– 74 శాతం నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు మనం వినియోగించే నత్రజని ఎరువులు, వ్యవసాయంలో వాడే జంతువుల ఎరువుల నుంచే విడుదలవుతున్నాయని వీరు వెల్లడించారు.

Economy Development : ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్‌..

ఎక్కువగా ఉద్గారాలు విడుదల చేసే మొదటి 10 దేశాల్లో చైనా, భారత్, అమెరికా, బ్రెజిల్, రష్యా, పాకిస్థాన్‌ , ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, కెనడా ఉన్నాయి. గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ల విడుదలలో కార్బన్‌ డయాక్సైడ్, మీథేన్‌ తర్వాత నైట్రస్‌ ఆక్సైడ్‌ మూడో స్థానంలో ఉందని పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే ఈ గ్రీన్‌ హౌస్‌గ్యాస్‌ల కారణంగా భూతాపం 1850–1900లతో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. వ్యవసాయ వ్యర్థాల నుంచి వచ్చే ఉద్గారాలు 2020లో 8 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా నమోదయ్యాయి. 1980లో ఉన్న 4.8 మిలియన్‌ టన్నులతో పోలిస్తే.. 67 శాతం అధికమని ఎర్త్‌ సిస్టమ్‌ సైన్స్‌ జర్నల్‌ ప్రచురించిన డేటాలో వెల్లడించింది. 

G7 Summit: ఈ దేశానికి రుణ ప్యాకేజీని ప్రకటించిన జీ7 దేశాల కూటమి!

#Tags