Comprehensive Trade Pact: భారత్, బంగ్లాదేశ్ కుదుర్చుకున్న కొత్త ఒప్పందాలు ఇవే..

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా జూన్ 22వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం, రక్షణ సహకారం, ప్రాంతీయ అంశాలపై చర్చించాయి.
➤ భారత్, బంగ్లాదేశ్ 10 కొత్త ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో డిజిటల్, సముద్రయానం, రైల్వే, అంతరిక్షం, ఆరోగ్యం వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుతాయి.
➤ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు ప్రారంభించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.
➤ తీస్తా నది పరిరక్షణపై చర్చించడానికి బంగ్లాదేశ్‌కు భారతదేశం టెక్నికల్ టీమ్‌ను పంపుతుంది.
➤ ఇండో-పసిఫిక్ కార్యక్రమంలో చేరాలనే బంగ్లాదేశ్ నిర్ణయాన్ని భారతదేశం స్వాగతిస్తుంది.
➤ బంగ్లా పౌరులకు వైద్య సేవల కోసం ఈ-మెడికల్ వీసాలను భారతదేశం ప్రారంభిస్తుంది.
➤ 1996 గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి చర్చలు ప్రారంభమవుతాయి.

G7 Summit 2024: జీ-7 దేశాల సమ్మిట్.. జ‌రిగింది ఎక్క‌డంటే..

#Tags