National Highways: ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో జాతీయ రహదా­రులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు 2024–25 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. కీలకమైన విజయ­వాడ తూర్పు బైపాస్‌తో సహా పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2024–25 వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన ప్రాజెక్టులు ఇవీ..
➬ కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ వరకు నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్‌ నిర్మాణానికి రూ.2,716 కోట్లు. 
➬ వినుకొండ – గుంటూరు నాలుగు లేన్ల రహదారికి రూ.2,360కోట్లు
➬ అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్‌ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు
➬ విజయవాడలోని మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.669కోట్లు


➬ చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై రణస్థలం వద్ద విడిచిపెట్టిన ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని  పూర్తిచేసేందుకు రూ.325కోట్లు
➬ గన్నవరం సమీపంలోని గుండు­గొలను ‘గామన్‌ జంక్షన్‌’ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ.150కోట్లు
➬ జాతీయ రహదారి 44పై 416 కి.మీ. వద్ద అసంపూర్తిగా ఉన్న నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసేందుకు రూ.140 కోట్లు

Foreign Investments: గడిచిన ఐదేళ్లలో ఏపీలోకి రూ.7,371 కోట్ల విదేశీ పెట్టుబడులు

#Tags