Modi-Xi Jinping Bilateral: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీ అయిన మోదీ

భారత్, చైనా సంబంధాలను మెరుగుపరిచేందుకు మరో కీలక పరిణామం సంభవించింది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం అక్టోబ‌ర్ 23వ తేదీ రష్యాలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో జరిగింది. ఐదేళ్ల తర్వాత ఇరు నాయకులు అధికారికంగా కలుసుకోవడం ఇదే తొలిసారి. 

ఈ భేటీలో, లద్దాఖ్‌ సమీపంలోని సరిహద్దు గస్తీపై చర్చించి, ఇరు దేశాల సైనికులు, ఉన్నతాధికారుల మధ్య కుదిరిన తాజా ఒప్పందాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా మోదీ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత పరిరక్షణ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అలాగే, పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా సంబంధాలు బలపడాలని కోరారు.

ఈ సమావేశం 50 నిమిషాలపాటు జరిగి, విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించాలి అని మోదీ తెలిపారు. చైనా-భారత్ సంబంధాలు ప్రపంచంలో అతి పెద్ద దేశాల మధ్య ఉన్న కీ సంబంధాలుగా, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

అక్టోబ‌ర్ 22, 23 తేదీల్లో రష్యా దేశంలోని కజాన్ వేదికగా జరిగిన‌ 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో మోదీ పాల్గొన్నారు.

Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి శాంతియుత పరిష్కారం.. పుతిన్‌తో మోదీ

మోదీ, జిన్‌పింగ్ మధ్య ఈ భేటీ అనంతరం, ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ చర్చలు నిర్వహించనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు.

ఇటువంటి చర్చలు భారత్-చైనా సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఒక పునాది ఏర్పాటుచేస్తాయని, పరిణామాత్మక సహకారానికి మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు.

ఈ సమావేశంలో మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్‌ మిర్జియోయెవ్, యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో కూడా భేటీ అయ్యారు.

China-Taiwan War: చైనా, తైవాన్‌ మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు! తైవాన్‌కు అండగా ఉన్న దేశాలివే..

#Tags