Degree Semester Results: ఎంజీయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
నల్లగొండ రూరల్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 27వ తేదీ ఎంజీయూ వీసీ గోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ రవి, పరీక్షల నియంత్రణ అధికారి జి.ఉపేందర్రెడ్డి విడుదల చేశారు.
మొదటి సెమిస్టర్లో మొత్తం 6,927 మంది విద్యార్థులు హాజరు కాగా 25.8 శాతం ఉత్తీర్ణత సాధించగా 73.7 శాతం ప్రమోట్ అయినట్లు తెలిపారు. మూడో సెమిస్టర్లో 7,135 మంది విద్యార్థులు హాజరు కాగా 31.9 శాతం ఉత్తీర్ణత సాధించగా 67.8 శాతం ప్రమోట్ అయ్యారని తెలిపారు. ఫలితాలపై సందేహం ఉన్న విద్యార్థులు ఒక సబ్జెక్ట్కు రూ.200 చెల్లించి మార్చి 6వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫలితాలను మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
Intermediate Exams 2024: ఇంటర్ పరీక్షలు... కంట్రోల్ రూం నంబర్ అదే
#Tags