Room to Read: ‘రూం టు రీడ్’ ప్రచార రథం ప్రారంభం
కైలాస్నగర్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించేలా రూం టు రీడ్ అనే ఎన్జీవో మేక్ రూం ఫర్ ఎర్లీ లర్నింగ్ నినాదంతో రీడింగ్ క్యాంపెయిన్ చేపడుతుంది.
ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ రాజర్షి షా సెప్టెంబర్ 3న కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అందులో పుస్తకాలతో ఏర్పాటు చేసిన లైబ్రరీని ఆయన పరిశీలించారు.
చదవండి: KGBV Jobs: కాస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఉద్యోగాలు
జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రచార రథాన్ని తిప్పుతూ విద్యార్థులకు రీడింగ్పై ఆసక్తి పెంపొందించాలని సూచించారు. ఇందులో జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో సాయన్న, డీడబ్ల్యూవో సబిత, డీఎల్పీవో ఫణీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
#Tags